బాధిత కుటుంబాలకు పరామర్శ

బాధిత కుటుంబాలకు పరామర్శ

చిగురుమామిడి ముద్ర న్యూస్: మండలంలోని రేకొండ గ్రామంలో ఇటీవల అనారోగ్య కారణాల వల్ల మరణించిన సంగెం బాలయ్య, పీరాల ఐలయ్యల కుటుంబాలను హుస్నాబాద్ శాసనసభ్యులు వొడితల సతీష్ కుమార్ ఆదేశాలతో బిఆర్ఎస్ జిల్లా నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు మామిడి అంజయ్య పరామర్శించి,ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అనంతరం వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించారు.ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు బిల్లా వెంకట్ రెడ్డి, సర్పంచ్ పిట్టల రజిత శ్రీనివాస్, ఎంపీటీసీ కొత్తూరి సంధ్య రమేష్, ఉప సర్పంచ్ మోర ప్రవీణ్,మండల యువజన నాయకులు తాటికొండ సందీప్ రెడ్డి,నాయకులు నల్లాల రాజేందర్ రెడ్డి, పరుపటి రవి తదితరులు ఉన్నారు.