ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ చైర్మన్ గా మంద శ్రీనివాస్

ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ చైర్మన్ గా మంద శ్రీనివాస్

చిగురుమామిడి ముద్ర న్యూస్: మండలంలోని గాగిరెడ్డిపల్లి గ్రామంలో గురువాయ నాబార్డ్ వారు గ్రామంలోని రైతులతో ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్ ను (రైతు సంఘం సొసైటీ) ఏర్పాటు చేశారు. అనంతరం ఎన్నికల అధికారి రామారావు పర్యవేక్షణలో రైతులు డైరెక్టర్లను ఏకగ్రీవంగా ఎన్నుకొని కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. అధ్యక్షునిగా మంద శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు కున సురేష్, కార్యదర్శి జెల్ల కుమార్, కోశాధికారి బొమ్మగొని రాజ బహుదూర్ గౌడ్, ఉప కోశాధికారి ఆన్నాడి స్వరూప, డైరెక్టర్లు నారాల రాజయ్య ఆన్నాడి నరసింహారెడ్డి వెంకటయ్య సులోచన బరిగెల సంపత్ లను ఏకగ్రీవంగా ఎన్నికైనారు. గెలుపొందిన వారికి ఎన్నికల అధికారి నియామక పత్రాలను అందించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మంద శ్రీనివాస్ మాట్లాడుతూ అందరి సహాయ సహకారంతో ఎఫ్ పి ఓను ముందుకు తీసుకెళ్తానని, రైతులకు కావాల్సిన ఎరువులు సకాలంలో తెప్పించి అందుబాటులో ఉంచుతామని సొసైటీ బలోపేతానికి కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను.