ఇది హిరణ్యకశ్యపుడి పాలన...!
![ఇది హిరణ్యకశ్యపుడి పాలన...!](https://mudranews.in/uploads/images/2023/03/image_750x_640b5fe89e6f7.jpg)
న్యూఢిల్లీ: దేశానికి సేవ చేస్తున్న వారిని, వారి పిల్లలను జైలు పాలు చేస్తున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ప్రస్తుత భారతీయ జనతా పార్టీ పాలన 'హిరణ్యకశ్యపుడు- ప్రహ్లాదుని' చరిత్రను గుర్తు చేస్తున్నదని ట్విట్టర్లో పేర్కొన్నారు. ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా అరెస్టును ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హరి ద్రోహి అయిన హిరణ్యకశ్యపుడు తనను తాను దేవుడిగా భావించి విర్రవీగినట్టే ప్రస్తుత పాలకులు వ్యవహరిస్తున్నారని కేజ్రీవాల్ విమర్శించారు.