ధర్నా విజయవంతం చేయాలి
![ధర్నా విజయవంతం చేయాలి](https://mudranews.in/uploads/images/2023/02/image_750x_63ef67f51370f.jpg)
ముద్ర,తంగళ్లపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం ఇందిరమ్మ కాలనీలో విలేకరుల సమావేశంలో మండల కార్యదర్శి కోడం రమణ,మోర అజయ్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం నిరుపేదలందరికీ డబల్ బెడ్ రూమ్ ఇండ్లు అందించాలి లేనిపక్షంలో స్థలం కేటాయించి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు అందించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తేదీ 22 బుధవారం రోజున ఎమ్మార్వో ఆఫీస్ ముందు ధర్నా చేస్తామని తెలిపారు.
తంగళ్ళపల్లి మండల వ్యాప్తంగా ఉన్నటువంటి ఇల్లులేని నిరుపేదలందరికీ వెంటనే డబల్ బెడ్ రూమ్ ఇండ్లను మంజూరు చేయాలని లేకుంటే స్థలం కేటాయించి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు అందించాలని అదేవిధంగా తంగళ్ళపల్లి మండలం టెక్స్ టైల్ పార్క్ ఇందిరమ్మ కాలనీ గ్రామంలో ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఇల్లు నిర్మించుకునే స్తోమత లేక ఖాళీగా అసంపూర్తిగా నిర్మాణం చేపట్టి వదిలేసిన వారందరికీ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఇల్లు నిర్మించుకోవడానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించాలని మరియు ప్రభుత్వం నిరుపేదలకు పంపిణీ చేసిన ఇందిరమ్మ కాలనీ గ్రామంలోని ప్లాట్లు అన్నింటినీ ఆన్లైన్, రెగ్యులరైజేషన్ క్రమబద్ధీకరించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి కొత్త పట్టాలను అందించి ప్రభుత్వం నిరుపేదలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో సిపిఎం పార్టీ తంగళ్ళపల్లి మండల శాఖ సభ్యులు శ్రీరాముల రమేష్ చంద్ర , కూచన శంకర్,జెల్ల సదానందం,ఆడెపు శుభశేకర్ , దూస రాజమల్లు,లింగంపేట రవి తదితరులు పాల్గొన్నారు.