ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపిన దివ్యాంగులు
![ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపిన దివ్యాంగులు](https://mudranews.in/uploads/images/2023/06/image_750x_64849e16187b2.jpg)
ముద్ర ప్రతినిధి, జగిత్యాల : జగిత్యాల జిల్లా సమీకృత కలెక్టరేట్ లో జగిత్యాల జిల్లా దివ్యాంగుల సంఘం నాయకులు సియం కేసిఆర్ దివ్యాంగులకు రూ. 4016 కు పెన్షన్ పెంచినట్లు ప్రకటించగా జగిత్యాల ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ ను కలిసి పుష్పగుచ్చం అందజేసి సియం కేసిఆర్ కు, ఎమ్మెల్యే కు ధన్యవాదములు తెలిపారు. ఈ సందర్బంగా ఎమ్మేల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా దివ్యాంగులకు 3వేల పెన్షన్ ఇస్తున్నాం.అదనంగా మరొక వెయ్యి సియం కేసిఆర్ పెంచడం చాలా సంతోషకరం అన్నారు.దేశంలో ఎక్కడా ఇంత పెద్ద మొత్తం లో పెన్షన్ లు ఇవ్వటం లేదుని, దివ్యాంగులకి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ గంగాధర్, దాసరి శ్రీనివాస్, అజ్ఘర్ ఖాన్, ప్రవీణ్, రాజేష్, కుమార్, వెంకటేష్,తదితరులు పాల్గొన్నారు.