రోడ్డుపై వరినాట్లతో వినూత్న నిరసన

రోడ్డుపై వరినాట్లతో వినూత్న నిరసన

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా నేతలు ప్రభుత్వంకు వినూత్నమైన నిరసన తెలిపారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు హైటెక్ సిటీలోని రోడ్లు అద్వాన్నంగా మారాయి. విషయం తెలుసుకున్న జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు సురేఖ సహచర మహిళా నేతలతో కలిసి వెళ్లి నీటి గుంతగా మారిన రోడ్డుపై వరినాట్లు వేశారు. మంచిర్యాల లోని పలు ప్రాంతాల్లో రహదారులు పొలాలను తలపిస్తుందని అన్నారు. రహదారులకు మరమ్మత్తులు చేయకపోవడంతో వర్షాకాలంలో వహనచోదకులు, పాదచారులు ఇబ్బందులు, ప్రమాదానికి గురవుతున్నారని ఆరోపించారు.