సీసీరోడ్డు పనుల పరిశీలన

సీసీరోడ్డు పనుల పరిశీలన

ముద్ర, లింగాలఘణపురం: జనగామ జిల్లా లింగాలఘనపూర్ మండలం వనపర్తి గ్రామంలో జరుగుతున్న సీసీ రోడ్డు పనులను జడ్పీటీసీ గుడి వంశీధర్‌‌రెడ్డి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అందజేసిన రూ.55 లక్షల నిధులతో ఈ సీసీ రోడ్డు పనులను చేపట్టినట్టు తెలిపారు. ఆయన వెంట సర్పంచ్ శ్రీధర్, ఎంపీటీసీ గోలి రాజిరెడ్డి గారు, దిశ కమిటీ సభ్యురాలు భాగ్య, వంచ సుదర్శన్‌రెడ్డి ఉన్నారు.