గుర్తుతెలియని మహిళా మృతదేహం వరద కాలువలో లభ్యం

గుర్తుతెలియని మహిళా మృతదేహం వరద కాలువలో లభ్యం

ఎక్కడినుండో కొట్టుకుని వచ్చిన గుర్తుతెలియని మహిళా మృతదేహం వరద కాలువలో లభ్యమైన సంఘటన గంగాధర మండలంలో చోటుచేసుకుంది. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల గ్రామ శివారులోని వరద కాలువలో గుర్తుతెలియని మహిళా మృతదేహం ఈ రోజు లభ్యమైంది, ఈ మృతదేహం చాలా దూరం నుండి వరద కాలువలో కొట్టుకు వచ్చిందని స్థానికులు చెబుతున్నారు,గంగాధర పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మృతదేహం ఏ ఊరికి సంబంధించినదో వివరాలు తెలియ రాలేదు, మృతదేహం ఆడ మృత దేహంగా స్థానికులు భావిస్తున్నారు. నిన్న రాత్రి 8 గంటల సమయం నుండి మృత దేహాన్ని గుర్తించినట్లు స్థానికులు చెబుతున్నారు, ముళ్ళ పొదలతో పాటు కొట్టుకు వచ్చిన మృతదేహం వైర్ కు చిక్కుకొని కురిక్యాల గ్రామ శివారులోని వరద కాలువలో ఆగింది.