బీజేపీ బలోపేతానికి సమష్టి కృషి: మాజీ ఎంపీ నర్సయ్య గౌడ్

బీజేపీ బలోపేతానికి సమష్టి కృషి: మాజీ ఎంపీ నర్సయ్య గౌడ్

ముద్ర ప్రతినిధి, బీబీనగర్: రానున్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ  బలోపేతానికి నాయకులు, బూత్ పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలంతా సమష్టిగా కృషి చేయాలని పార్లమెంట్ మాజీ సభ్యుడు బూర నర్సయ్య గౌడ్ పిలుపునిచ్చారు. బీబీనగర్  మండల పార్టీ అధ్యక్షుడు సురకంటి జంగారెడ్డి అధ్యక్షతన బీబీనగర్లోని ఫేమస్ ఫంక్షన్ హాల్లో శుక్రవారం జరిగిన పార్టీ ఎన్నకల సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

ఈ సందర్భంగా మాలాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థులకు భారీ మెజారిటీ సమకూర్చి ఎన్నికలలో విజయం సాధించి పెట్టాలని కోరారు. ముచ్చటగా మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీని గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భువనగరి అసెంబ్లీ పార్టీ కన్వీనర్ చిక్కా కృష్ణ, ఇంజమూరి ప్రభాకర్, గడ్డం జంగారెడ్డి, కోలన్ లక్ష్మారెడ్డి, బలరాం, తోట వెంకటేష్, గూడూరు శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.