చంద్రబాబు, పవన్ కల్యాణ్కు శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్...
![చంద్రబాబు, పవన్ కల్యాణ్కు శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్...](https://mudranews.in/uploads/images/2024/06/image_750x_665fffdce47b1.jpg)
ముద్ర,తెలంగాణ:-ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయబోతున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లకు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. వారిద్దరిని అభినందిస్తూ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రజల మద్దతుతో కూటమి విజయం సాధించిందని, పాలనలోనూ వారి విశ్వాసం పొందాలని సూచించారు.