లయన్స్ క్లబ్ సెక్రటరీ ఔదార్యం

లయన్స్ క్లబ్ సెక్రటరీ ఔదార్యం

హైదరాబాద్: లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ నవభారత్ సెక్రటరీ డాక్టర్ స్వరూప రాణి ఇద్దరు పేద బాలికలకు విద్యాభ్యాసం నిమిత్తం 50 వేల రూపాయలు అందజేశారు. ఐదేళ్ల బాలిక చామకూరి వర్ణిక, మరో నాలుగేళ్ల పాప మౌక్ష శ్రీ చదువు కోసం ఈ సహాయాన్ని అందజేసినట్లు ఆమె తెలిపారు. తన సోదరుడు సురేష్ బాబు సంస్మరణ నిమిత్తం ఆమె చేపట్టిన ఈ కార్యక్రమాన్ని క్లబ్ బాధ్యులు ప్రశంసించారు. క్లబ్ జోన్ కమిటీ చైర్ పర్సన్ సిహెచ్ గోపాలకృష్ణ, క్లబ్ అధ్యక్షుడు బి వినయ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.