నగర వాసులకు అలర్ట్‌..ఈ రూట్లలో రెండు రోజుల పాటు ఎంఎంటీఎస్‌ రైళ్లు రద్దు!

నగర వాసులకు అలర్ట్‌..ఈ రూట్లలో రెండు రోజుల పాటు ఎంఎంటీఎస్‌ రైళ్లు రద్దు!

ముద్ర,హైదరాబాద్:-సికింద్రాబాద్‌ స్టేషన్‌లో ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణ పనుల కారణంగా శని, ఆదివారాల్లో మొత్తం 26 ఎంఎంటీఎస్‌, డెమో రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. ఫలక్‌నుమా-సికింద్రాబాద్‌(Falaknuma-Secunderabad), సికింద్రాబాద్‌-మేడ్చల్‌ రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.మేడ్చల్‌-లింగంపల్లి, మేడ్చల్‌-హైదరాబాద్‌(Medchal-Lingampally, Medchal-Hyderabad) మార్గాల్లో ఎంఎంటీఎస్‌ సర్వీసులతో పాటు సికింద్రాబాద్‌-సిద్దిపేట(Secunderabad-Siddipet) మార్గంలో నడిచే డెమోరైళ్లను నిలిపివేస్తున్నట్లు సీపీఆర్‌వో రాకేశ్‌ తెలిపారు.