కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయండి.
![కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయండి.](https://mudranews.in/uploads/images/2023/10/image_750x_65267f0ab57f4.jpg)
- బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జి వి రామకృష్ణారావు
చిగురుమామిడి ముద్ర న్యూస్: చిగురుమామిడి మండలంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షులు మామిడి అంజయ్య ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా జిల్లా పార్టీ అధ్యక్షులు జి వి రామకృష్ణా రావు హాజరై మాట్లాడుతూ... ఈనెల 15 వ తేదీన హుస్నాబాద్ పట్టణంలో జరిగే కేసీఆర్ భారీ బహిరంగ సభను విజవంతం చేయాలనీ కార్యకర్తలకి సూచించారు. సభకు మండలం నుండి పదిహేను వేలమందికి తగ్గకుండా తరలిరావాలన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత హుస్నాబాద్ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందని మెట్ట ప్రాంతమైన చిగురుమామిడి మండలం నేడు జల కళతో పచ్చని పంట పొలాలతో సస్య శామలంగా ఉందన్నారు.ఈ ప్రాంత అభివృద్ధి చేయడంలో సిఎం కేసీఆర్,ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ కృషి ఎంతో ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో కార్యకర్తలు నాయకులు అందరు సమిష్టి కృషితో పని చేసి మూడవసారి ఎమ్మెల్యే సతీష్ కూమార్ ను గెలిపంచాలని కోరారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను గ్రామ గ్రామాన విస్తృతంగా ప్రచారం చేయాలనీ ఈ నెల రోజులు కష్టపడితే ఐదేళ్లు మనం ఎంతో అభివృద్ధి ని చూడొచ్చు అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొత్త వినీత శ్రీనివాస్ రెడ్డి, జడ్పీటీసీ గీకురు రవీందర్, సింగిల్ విండో చైర్మన్ జంగా వెంకటరమణరెడ్డి,వైస్ ఎంపీపీ బేతి రాజిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు సాంబారి కొమురయ్య, మంకు శ్రీనివాస్ రెడ్డి, అందె సుజాత, ఆకవరం మఠం భవాని, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.