రాష్ట్రంలో పలుచోట్ల ఎన్ఐఏ  సోదాలు

రాష్ట్రంలో పలుచోట్ల ఎన్ఐఏ  సోదాలు

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో పలుచోట్ల జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) శనివారం సోదాలు చేసింది. వరంగల్, కొత్తగూడెం, చర్ల, భద్రాచలం ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగాయి. మావోయిస్టులకు ఆయుధాలు, ఎలక్ట్రానిక్ పరికరాల సరఫరా అవుతున్నాయనే అనుమానాలతో ఈ సోదాలు జరిగినట్లు సమాచారం. ఈ సోదాల్లో డ్రోన్లు, ఎలక్ట్రికల్ పరికరాలను ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సోదాలకు సంబంధించి 12మందిపై ఎన్ఐఏ కేసులు నమోదు చేసినట్లు తెలుస్తుంది.