మణికొండలో అంగరంగ వైభవంగా ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు

మణికొండలో అంగరంగ వైభవంగా ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు

(మణికొండ) : .తెలుగు వారి ఆరాధ్య దైవం,పేదల,బడుగు బలహీనవర్గాలకు రాజ్యాధికారం  కల్పించిన మహానుభావుడు ,పద్మశ్రీ మాజీ ముఖ్య మంత్రి స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు శతజయంతి సందర్బంగా మణికొండలోని కాకతీయ సేవాసమితి ఆధ్వర్యంలో బసవతారక కాన్సర్ హాస్పిటల్ 250 మంది రోగులకు పండ్లు పంపిణి మరియు ఆల్కపూర్ టౌన్షిప్ లో ఎన్టీఆర్ ట్రస్ట్ సౌజన్యం తో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయటం జరిగింది.

ఈ కార్యక్రమం లో మణికొండ మున్సిపల్ చైర్మన్ కస్తూరి నరేంద్ర, వైస్ చైర్మన్ నరేంద్ర రెడ్డి, ఫ్లోర్ లీడర్ రామకృష్ణ రెడ్డి, మున్సిపాలిటీ  కౌన్సిలర్స్ మరియు కమ్మ సంఘం నాయకులు ఎన్టీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఎన్టీఆర్ ట్రస్ట్ వారు కాకతీయ సేవా సమితి కార్యవర్గ సభ్యులను ఇంత పెద్ద కార్యక్రమం (103 యూనిట్స్) చేసినందుకు అభినదించారు.