సీఎం పదవిపై రాజీకి సిద్ధంగా లేను: డీకే శివకుమార్
![సీఎం పదవిపై రాజీకి సిద్ధంగా లేను: డీకే శివకుమార్](https://mudranews.in/uploads/images/2023/05/image_750x_64620f678a600.jpg)
సీఎం పదవి విషయంలో తాను రాజీకి సిద్ధంగా లేనని కాంగ్రెస్ కర్నాటక అధ్యక్షుడు డీకే శివకుమార్ చెప్పారు. కేసీ వేణుగోపాల్తో డీకే శివకుమార్ మంతనాలు జరుపుతున్నారు. సీఎంగా తనకు అవకాశం ఇవ్వాలని శివకుమార్ కోరారు. తనవల్లే ఓల్డ్ మైసూరులో ఎక్కవ సీట్లు వచ్చాయని చెప్పారు.
వొక్కలిగ ఓట్లు కాంగ్రెస్ వైపు మళ్ళాయన్నారు. పవర్షేరింగ్ ఫార్మలాతో సిద్ధరామయ్య హైకమాండ్ ముందుకు వచ్చారు. సిద్ధరామయ్య ఢిల్లీకి వెళ్ళగా డీకే శివకుమార్ ఇంకా బెంగళూరులోనే ఉన్నారు. సిద్ధరామయ్య కాంగ్రెస్ అగ్రనేతలతో సాయంత్రం భేటీ అవుతారు. డీకే శివకుమార్ ఢిల్లీ టూర్పై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.