సీఎం పదవిపై రాజీకి సిద్ధంగా లేను: డీకే శివకుమార్​

సీఎం పదవిపై రాజీకి సిద్ధంగా లేను: డీకే శివకుమార్​

సీఎం పదవి విషయంలో తాను రాజీకి సిద్ధంగా లేనని కాంగ్రెస్​ కర్నాటక అధ్యక్షుడు డీకే శివకుమార్​ చెప్పారు.  కేసీ వేణుగోపాల్​తో డీకే శివకుమార్​ మంతనాలు జరుపుతున్నారు. సీఎంగా తనకు అవకాశం ఇవ్వాలని శివకుమార్​ కోరారు. తనవల్లే ఓల్డ్​ మైసూరులో ఎక్కవ సీట్లు వచ్చాయని చెప్పారు.

వొక్కలిగ ఓట్లు కాంగ్రెస్​ వైపు మళ్ళాయన్నారు. పవర్​షేరింగ్​ ఫార్మలాతో సిద్ధరామయ్య హైకమాండ్​ ముందుకు వచ్చారు. సిద్ధరామయ్య ఢిల్లీకి వెళ్ళగా డీకే శివకుమార్​ ఇంకా బెంగళూరులోనే ఉన్నారు. సిద్ధరామయ్య కాంగ్రెస్​ అగ్రనేతలతో సాయంత్రం భేటీ అవుతారు. డీకే శివకుమార్​ ఢిల్లీ టూర్​పై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.