సూర్యపేట హైటెక్ బస్ స్టాండ్ లో ప్రయాణికునికి, ఆర్టీసీ డ్రైవర్ కు మధ్య చిల్లర వివాదం

సూర్యపేట హైటెక్ బస్ స్టాండ్ లో ప్రయాణికునికి, ఆర్టీసీ డ్రైవర్ కు మధ్య చిల్లర వివాదం

ముద్ర ప్రతినిధి, సూర్యాపేట సూర్యపేట నుండి హైద్రాబాద్ వెళ్తూన్న సూర్యపేట డిపో కు చెందిన ఆర్టీసీ బస్ లో సూర్యపేటకు చెందిన శ్రావణ్ ఎక్కాడు. 500 రూపాయలు ఇచ్చి  హైద్రాబాద్ టికెట్ తీసుకున్నాడు...మిగతా  చిల్లర హైద్రాబాద్ వెళ్లిన తరువాత తీసుకో అని డ్రైవర్ కం కండక్టర్ శ్రీనివాస్ ప్రయాణికుడు శ్రావణ్ తో అన్నాడు. దాంతో తనకి మిగతా  చిల్లర ఇప్పుడే ఇవ్వాలని ప్రయాణికుడు డ్రైవర్ తో వాగ్వాదానికి దిగాడు. ఇద్దరి మధ్య మాట మాట పెరిగి.. ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ పై మజ్జిగ పొసే గరిటే తో  ప్రయాణికుడు శ్రావణ్ దాడి చేశాడు. శ్రీనివాస్ తలకు తీవ్ర గాయమవడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి,గాయపర్చిన శ్రవణ్ ను ఆర్టీసీ సిబ్బంది  పోలీసులకు అప్పగించారు.