కోదాడ బీఎస్పీ అభ్యర్థిగా పిల్లుట్ల

కోదాడ బీఎస్పీ అభ్యర్థిగా పిల్లుట్ల

ముద్ర ప్రతినిధి , కోదాడ: బహుజన సమాజ్ పార్టీ కోదాడ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పిల్లుట్ల. శ్రీనివాస్ ను మంగళవారం ప్రకటించింది. ఈ మేరకు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు . కోదాడ నియోజకవర్గ బీఎస్పీ పార్టీ ఇంచార్జ్ గా ప్రస్తుతం కొనసాగుతున్న పిల్లుట్ల. శ్రీనివాస్ నే అభ్యర్థిగా ప్రకటించడం పట్ల బీఎస్పీ నాయకులు , పిల్లుట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేశారు . ఈ సందర్భంగా పిల్లుట్ల. శ్రీనివాస్ మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి , జనరల్ స్థానంలో బిసి అభ్యర్థిని అయిన తనకు అవకాశం ఇవ్వడం సంతోషంగా ఉందని , కోదాడ నియోజకవర్గంలో తన గెలుపుతో బీఎస్పీ జెండా ఎగురవేసి బహుజన రాజ్య స్థాపన చేస్తామని ఆయన అన్నారు.