సీనియర్ లీడర్ జీవన్ రెడ్డి వక్రీకరించి మాట్లాడుతున్నారు

సీనియర్ లీడర్ జీవన్ రెడ్డి వక్రీకరించి మాట్లాడుతున్నారు
  • ఆయన స్థాయికి తగదు ... ప్రశ్నించే దాంట్లో నిజలు  ఉండాలే
  • ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: సీనియర్ లీడర్లు వక్రీకరించి మాట్లాడుతున్నారు .. ప్రశ్నించే దాంట్లో నిజలు కూడా ఉండాలే అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని ఉద్దేశించి జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్ప్రెపాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్   మాట్లాడుతూ జీవన్ రెడ్డి మాట్లాడిన మాటలు ఆయన స్థాయికి తగవని అభ్యర్ధి ప్రకటనతో పాటు  బీ అర్ ఎస్ పార్టీ  హైకమాండ్ అభ్యర్థులకు 10 కోట్లు ఇచ్చారని ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు. తమకు హైదరాబాద్ లో అస్తులున్నయి.. వందల ఎకరాల భూమి ఉండే.. గెలిచాక కొంత అమ్మిన  అన్ని తెలిసి జీవన్ రెడ్డి అసత్యాలు మాట్లాడటం సరి కాదన్నారు. పది సార్లు పోటి చేసిండ్రు.. ఎమ్మెల్యే గా ఓడిపోతే ఎమ్మెల్సీ గా పోటీ చేసిండ్రు  జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోట్లు పెట్టీ ఆడ్స్ ఎలా ఇచ్చారు....అంత మొత్తంలో డబ్బు మీకు ఎలా వచ్చిందని ప్రశ్నించారు.

ఇందిర గాంధీని తిట్టి జీవన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారని, ఇందిరా గాంధీ చనిపోయాక కాంగ్రెస్ పార్టీ లో చేరి నీతి సూక్తులు వల్లించడమా.. ఎన్టీఆర్ బిక్ష పెడితే నాదెండ్ల భాస్కరరావు చెంతన చేరింది నిజం కాదా.. అని ప్రశ్నించారు. డబ్బులు లేకుండానే ఓట్లు అడిగార.. డబ్బు ముట్టరు.. పైసలు ఇవ్వరా అంత సత్యవంతులా మీరు మీ పార్టీ అని అన్నారు. మూడు గంటల ఉచిత కరెంట్ ఇచ్చి ముప్పు తిప్పలు పెట్టారని, రుణ మాఫీ వచ్చింది మిత్తికి పోయిందని అబద్ధపు ప్రచారం చేస్తున్నారు, మీకు రుణ మాఫీ కాలేదా..? పత్రిక ముఖంగా ప్రకటించాలన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ల్లో రుణ మాఫీ రైతు బంధు, రైతు భీమా ఉందా.. రోజు మీటింగ్ లు పెట్టి ఆరోపణలు చేయటం అయన స్థాయికి కరెక్ట్ కాదన్నారు.  నర్సింగాపూర్  లో మాస్టర్ ప్లాన్ ను రద్దు చేసిన  కూడా అబద్దాలు చెప్తూ ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో అర్బన్  జడ్పిటిసి మహేష్, మండల పార్టీ అధ్యక్షులు బాల ముకుందం, సీనియర్ నాయకులు దావా సురేష్, రౌతు గంగాధర్, పాక్స్ ఛైర్మెన్ మహిపాల్ రెడ్డి, రైతు బందు మండల కన్వీనర్ నక్కల రవీందర్ రెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షులు చెరుకుజాన్, సర్పంచ్ ప్రకాష్, మతిన్ తదితరులు ఉన్నారు.