ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం పిఆర్ టి యు తోనే సాధ్యం
![ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం పిఆర్ టి యు తోనే సాధ్యం](https://mudranews.in/uploads/images/2023/08/image_750x_64cb7c9eb3353.jpg)
- పిఆర్ టి యు ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు యాళ్ళ అమర్ నాథ్ రెడ్డి
ముద్ర ప్రతినిధి,జగిత్యాల: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం పిఆర్ టి యు తోనే సాధ్యమని పిఆర్ టి యు ఎస్ జిల్లా అధ్యక్షుడు యాళ్ళ అమర్ నాథ్ రెడ్డి అన్నారు. పిఆర్ టియు ఎస్ సభ్యత్వ వారోత్సవాలలో భాగంగా జగిత్యాల అర్బన్ మండలంలో సభ్యత్వ నమోదును ప్రారంభించారు.ఈ సదర్భంగా మాట్లాడుతూ త్వరలోనే ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించబడుతాయని, ఉపాధ్యాయులకు సంబంధించి పెండింగ్ బిళ్ళ సమస్యను పరిష్కరిస్తామని అన్నారు. 2003 డీఎస్సీ అధ్యాపకులకు ఈనెల 31 లోపు పాత పెన్షన్ తీసుకొస్తామని, అన్ని ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేసే విధంగా హెల్త్ కార్డ్స్ ను తీసుకొస్తామని, త్వరలో పిఆర్సి కమిషన్ వేయించి ఐఆర్ ఇప్పించే విధంగా రాష్ట్ర సంఘం ప్రయత్నం చేస్తుందని అలాగే కే జీ బీ వీ ఉపాధ్యాయులకు టైమ్ స్కేల్ ఇప్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పి ఆర్ టి యు టి ఎస్ జగిత్యాల అర్బన్ మండల శాఖ అధ్యక్షులు అబ్దుల్ బాసిత్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు వూటూరి మహేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలిచాల సత్యరాజ్, మండల కార్యదర్శి శోభన్ తదితరులు పాల్గొన్నారు.