కొండగట్టులో పోటేత్తిన భక్తులు...

కొండగట్టులో పోటేత్తిన భక్తులు...

ముద్ర, మల్యాల: ప్రసిద్ధి కొండగట్టు అంజన్న పుణ్యక్షేత్రం మంగళవారం భక్తులతో పోటేత్తిoది.. వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తజనo కోనేరు స్నానం ఆచరించారు. అనంతరం అంజన్నను దర్శించుకుని, మొక్కులు తీర్చుకున్నారు. ఉదయం సమయంలో రద్దీ ఎక్కువగా ఉండడంతో ఆలయ సమీపంలోని మారుతీ కాటేజ్ వరకు భక్తులు భారులు తీరారు. అధికంగా నూతన వాహన పూజలు జరిగాయి. ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా ఏర్పాట్లు చేశారు. వేసవిని దృష్టిలో పెట్టుకొని, భక్తుల సౌకర్యం కోసం ఆలయం చుట్టూ చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తున్నారు.