కలెక్టర్ ను అభినందించిన టీజీవో నాయకులు
![కలెక్టర్ ను అభినందించిన టీజీవో నాయకులు](https://mudranews.in/uploads/images/2023/12/image_750x_6579b7b5269e4.jpg)
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: శాసనసభ ఎన్నికలు జిల్లాలో ప్రశాంతంగా, విజయవంతం చేసిన సందర్భంగా జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషను తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇది సమిష్టి కృషితో జరిగిన విజయమని, రాబోయే ఎన్నికల్లో కూడా ఉద్యోగులంతా సమిష్టి కృషితో విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గంగుల సంతోష్ కుమార్, ప్రధాన కార్యదర్శి మామిడి రమేష్, అసోసియేటెడ్ అధ్యక్షుడు కందుకూరి రవిబాబు, విజేందర్ , విశ్వాన్, ప్రభు ,కిరణ్ హనుమంతరావు, రాజేశ్వరి, శైలజ రాణి పాల్గొన్నారు.