మున్నూరు కాపు విద్యార్థుల హాస్టల్ భవనం ఎమ్మెల్యేకు వినతి
![మున్నూరు కాపు విద్యార్థుల హాస్టల్ భవనం ఎమ్మెల్యేకు వినతి](https://mudranews.in/uploads/images/2023/06/image_750x_649ea02eba6d4.jpg)
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: మున్నూరు కాపు విద్యార్థులకు హాస్టల్ కమ్యూనిటీ భవనంనిర్మాణం కోసం జిల్లా కేంద్రంలో స్థలం కేటాయించాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ మున్నూరు కాపు ప్రజా ప్రతినిధులు,కుల సంఘ మండల ,గ్రామాల నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. నియోజకవర్గలో 60 వేలకు పైగా ఉన్న మున్నూరు కాపు కుటుంభాలున్నాయని , సమావేశాల నిర్వహణ ,ఇతర కార్యక్రమాలకు సంఘ భవననిర్మాణం, విద్యార్థుల కోసం హాస్టల్ వసతి ఆవశ్యకత ను వారువివరించారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సానుకూలంగా స్పందించి మంత్రి కొప్పుల ఈశ్వర్ దృష్టికి తీసుకెళ్లాలని తన వంతు సహకారం తప్పకుండా ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి, జిల్లా సీనియర్ సిటీజనన్స్,పెన్షనర్ల, అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్, విద్యావంతుల వేదిక సాసల మల్లికార్జున్,మున్నూరు కాపు నియోజకవర్గ నాయకులు కోల శ్రీనివాస్, జంగిలి రాజి రెడ్డి, ఆకుల లక్ష్మీ నారాయణ, సమిండ్ల శ్రీనివాస్, వెంకట్, సత్యం, చిట్ల రమణ, కొల్లూరి వేణు, ఆంజయ్య ,నీలి మల్లయ్య, రమేష్, తిరుపతి, లైసెట్టి వెంకటి, కొక్కుగంగాధర్, తెలు రాజు, రమేశ్, పుప్పాల కిషోర్, గంగాధర్, గంగారాం, నియోజకవర్గ, మండల, గ్రామ సంఘాల ప్రజా ప్రతినిధులు, నాయకులు,తదితరులు పాల్గొన్నారు.