చిన్న శంకరంపేటలో టిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం: హాజరైన ఎమ్మెల్యే,ఎమ్మెల్సీ

చిన్న శంకరంపేటలో టిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం: హాజరైన ఎమ్మెల్యే,ఎమ్మెల్సీ

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ శాసనసభ్యులు, జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షురాలు ఎం.పద్మా దేవేందర్ రెడ్డి చిన్న శంకరంపేట మండలంలో బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నిర్వహించారు. ముఖ్య అతిదిగా పార్టీ జిల్లా సమన్వయకర్త, ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం హాజరయ్యారు. ముఖ్యమంత్రి కెసిఆర్  సందేశంతో ప్రారంభమైన ఆత్మీయసమ్మేళనంలో వేలాది మంది కార్యకర్తలతో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. డప్పు చప్పుల్లు, డీజే,  బాణాసంచా చప్పుళ్ళతో మండల కేంద్రం చిన్న శంకరంపేట దద్దరిల్లింది.

కార్యకర్తలను ఉద్దేశించి మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ  రాబోయే ఎన్నికల్లో బిఆర్ఎస్ విజయం ఖాయమన్నారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలన్నది సీఎం కేసీఆర్ ధ్యేయమని పేర్కొన్నారు.మెదక్ గడ్డపై మళ్లీ గులాబీ జెండా ఎగరేయడమే లక్ష్యంగా అనుచరించాల్సిన అంశాలపై కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. మెదక్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరవేయడమే  లక్ష్యమని, కార్యకర్తలే టిఆర్ఎస్ పార్టీ గుండె బలం అన్నారు. వారిని కంటికి రెప్పలా కాపాడుకోవడం నా బాధ్యత  అన్నారు.