కళాకారులకు పుట్టినిల్లు తెలంగాణ: మంత్రి కొప్పుల ఈశ్వర్

కళాకారులకు పుట్టినిల్లు తెలంగాణ: మంత్రి కొప్పుల ఈశ్వర్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: కళాకారులకు పుట్టినిల్లు తెలంగాణ రాష్ట్రం అని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం తెలంగాణ సాహితి దినోత్సవం పురస్కరించుకొని సమీకృత జిల్లా కార్యాలయం సముదాయ సమావేశ మందిరంలో కవి సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరై కళాకారులను ఉద్దేశించి మాట్లాడారు.

ఈ సందర్భంగా కవులు వారి కవితలతో ఆహుతులను ఆకట్టుకోగా చిన్నారుల నృత్య ప్రదర్శనలు ఆహుతులను మంత్రముగ్దులని చేశాయి. అనంతరం మంత్రి కొప్పుల ఈశ్వర్ విజేతలకు బహుమతులు అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ గొల్లపల్లి చంద్రశేఖర్ గౌడ్, డి సి ఎం ఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, జిల్లా అదన కలెక్టర్లు బిఎస్ లతా, మంద మకరంద్, మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్ నియోజకవర్గంలోని ఎంపీపీలు, జడ్పిటిసిలు ఇతర ప్రజాప్రతినిధులు సాహితి వేత్తలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.