దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
The government is committed to the welfare of the disabled Singireddy Vasanti

 ముద్ర, వనపర్తి ప్రతినిధి: దివ్యాంగుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి పని చేస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సతీమణి సింగిరెడ్డి వాసంతి అన్నారు. గురువారం వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దివ్యాంగులకు దివ్యాంగుల సంక్షేమం శాఖ నుండి మంజూరైన నాలుగు త్రిచక్ర వాహనాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

కిలా గణపురం రామకృష్ణ, పెద్దమందడి మండలం అల్వాల గ్రామానికి చెందిన నాగరాజు, పెబ్బేరు గ్రామానికి చెందిన వడ్ల శేఖరా చారి, వనపర్తి మండలం చిట్యాలకు చెందిన నాగరాజులకు త్రిచక్ర వాహనాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్  మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.