టీడీపీ చేసిన అభివృద్ధిని వివరించాలి

టీడీపీ చేసిన అభివృద్ధిని వివరించాలి
  • టీడీపీ జనగామ ఇంచార్జి రామిని హరీష్ 

ముద్ర ప్రతినిధి, జనగామ :టీడీపీ హయాంలో చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించి పార్టీకి పూర్వవైభవం తేవాలని ఆ పార్టీ జనగామ నియోజకవర్గ ఇంచార్జి రామిని హరీష్ కార్యకర్తలకు సూచించారు. ఆదివారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి పట్టణ అధ్యక్షుడు కొత్తపల్లి సమ్మయ్య అధ్యక్షత వహించగా హరీష్ పాల్గొని మాట్లాడారు.

మరో  నాలుగు నెలల్లో ఎలక్షన్లు ఉన్నందున కార్యకర్తలు పార్టీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి ఏళ్లేష్, బేడిదే మైసయ్య, భైర బాబు, చీకట్ల నవీన్, ఎండి ఇక్బాల్, కలీం, సురుగు సతీష్, సీసా శ్రీధర, గడ్డం కృష్ణ, సిరాజ్, సుద్దాల సురేష్, అన్వేష్, సందీప్, కిషన్, కనకరాజ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.