మంత్రి కేటీఆర్ కు వడ్డెర సంఘం సంపూర్ణ మద్దతు

మంత్రి కేటీఆర్ కు వడ్డెర సంఘం సంపూర్ణ మద్దతు

ముద్ర,తంగళ్లపల్లి:- రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని ఇంపీరియల్ గార్డెన్ లో వడ్డెర సంఘం సభ్యులు సమావేశం నిర్వహించి, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో  మంత్రి కేటీ రామారావు కి మండల వడ్డెర సంఘం పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు.మంత్రి కేటీఆర్ తోనే అభివృద్ధి సాధ్యమని, సమస్యలు పరిష్కారం అవుతాయని నమ్ముతూ తీర్మానం చేశామన్నారు.వడ్డెర సంఘ మండల అధ్యక్షుడు దేవయ్య ,సభ్యులు,నేతలు మంత్రి కేటీఆర్ నామినేషన్ల ఖర్చు ల నిమిత్తం ఒక లక్ష నూట పదహారు వేల రూపాయలు అందజేశారు.బి అర్ ఎస్ సీనియర్ నేత బొల్లి రామ్మోహన్ వడ్డెర సంఘం తీర్మానాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పడిగేల మానస,బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజన్న,సర్పంచ్ అంకారపు అనిత,ఎంపీ టీ సి కోడి అంత య్య,ఫ్యాక్స్ వైస్ చైర్మన్ వెంకట రమణారెడ్డి, పడి గెల రాజు,ఏయంసి డైరెక్టర్ సద్దా రోజా,కొడం సంధ్య రాణి, వడ్డెర సంఘ నేతలు, సభ్యులు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.