చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి
![చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి](https://mudranews.in/uploads/images/2023/05/image_750x_6450d6a16c7e4.jpg)
జిల్లాకు పేరు ప్రఖ్యాతులు సాధించాలి- వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ముద్ర ప్రతినిధి, వనపర్తి : చదువుతోపాటు క్రీడలలో రాణించి జిల్లాకు, రాష్ట్రానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వేసవి క్రీడల శిక్షణ శిబిరంలో పాల్గొనే విద్యార్థులకు క్రీడా సామాగ్రిని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వేసవి శిక్షణ శిబిరంలో విద్యార్థులు క్రీడలలో రాణించాలని అన్నారు. ప్రభుత్వం క్రీడాకారులను వెలికి తీసేందుకుగాను వేసవిలో శిక్షణ శిబిరాలు నిర్వహించి చదువుతోపాటు క్రీడలలో రాణించేలా చర్యలు తీసుకున్నదని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్పోర్ట్స్ అధికారి యస్. ఏ. రెహమాన్, సుధీర్ రెడ్డి, పి. ఈ. టి. లు కోచి్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.