రాష్ట్రంలో బీజేపీ రాజకీయ ఆటలు మొదలు పెట్టింది  

రాష్ట్రంలో బీజేపీ రాజకీయ ఆటలు మొదలు పెట్టింది  

రాష్ట్రంలో బీజేపీ రాజకీయ ఆటలు మొదలు పెట్టిందని బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ  పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు.  బీజేపీ నేతలను ప్రజలు ఛీత్కరించు కుంటున్నారన్నారు. కెసిఆర్ ను ఎదుర్కునే దమ్ము లేక విద్యార్థులను,  వారి తల్లి దండ్రులను వాడుకుంటున్నారన్నారు.  3వ తేదీ సాయంత్రం సంజయ్ ప్రశాంత్ కు ఫోన్ చేసి ప్రశ్నపత్రాలు లీక్ కావాలని చెప్పారు. కమలాపూర్ లో 9.45 కు ప్రశ్న పత్రాలు ఫోటోలు తీశారన్నారు.  సంజయ్ అదేశాలతోనే బీజేపీ కార్యకర్తలు  ప్రశ్న ప్రతాలు లీక్ చేశారన్నారు.  సంజయ్ పై పిడీ యాక్ట్ పెట్టాలన్నారు.  వికారాబాద్ లో బీజేపీ అనుబంధ సంఘం ఉపాధ్యాయులు పేపర్ బయటకు వచ్చేలా చేశారన్నారు.