బ్రహ్మోత్సవాలు ప్రారంభం - శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో

బ్రహ్మోత్సవాలు ప్రారంభం - శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో

ముద్ర, ఎల్లారెడ్డిపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం నుండి ప్రారంభమయ్యాయి. శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి దత్తత దేవాలయమైన రామాలయంలో ఈ నెల 30న జరిగే కళ్యాణానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ సూర నరసయ్య పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుండి ఆలయ సంప్రోక్షణ,నవ కలశ స్థాపన,దేవత ఆహ్వానం కార్యక్రమాలతో ప్రారంభించడం జరుగుతుందన్నారు. ఈనెల 29 న బలిహరణం, అగ్ని ప్రతిష్ట హోమం జరుగుతుందన్నారు. 30న శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణం ఘనంగా జరుగుతుందని,అదే రోజు హనుమంతుని వాహనంపై ఊరేగింపు ఉంటుందన్నారు. 31 శుక్రవారం రోజున అశ్వ వాహనంపై స్వామివారి        ఊరేగింపు ఏప్రిల్ 1న గరుడ వాహనంపై స్వామివారి ఊరేగింపు, 2 వ తేదీన రథోత్సవంతో పాటు రాత్రి 9 గంటలకు ఏకాంత సేవతో బ్రహ్మోత్సవాలు ముగియడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ నిమ్మలక్ష్మీ, ఉప సర్పంచ్ మహేందర్,ఎంపీటీసీ సుల్తానా,మాజీ సర్పంచ్ నరసయ్య, తదితరులు పాల్గొన్నారు