ఫ్రిడ్జ్​కు షాక్​: చిన్నారి మృతి

ఫ్రిడ్జ్​కు షాక్​: చిన్నారి మృతి

ముద్ర, తెలంగాణ బ్యూరో : చాకెట్ల కోసం ఫ్రిడ్జ్ ని తెరవబోయిన చిన్నారి కరెంటు షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. నిజామాబాద్ జిల్లా నందిపేట పట్టణంలోని ఎన్ మార్ట్ కు సోమవారం తండ్రితో కలిసి చిన్నారి రుషిత(4) వచ్చింది. తండ్రి వస్తువులు కొంటున్న క్రమంలో మార్ట్ లోని ఫ్రిడ్జ్ లో చాక్లెట్లు గమనించిన రుషిత.. వాటిని తీసుకునేందుకు డోర్ ను తాకింది. కరెంట్​షాక్​కొట్టడంతో రుషిత గిలగిలా కొట్టుకుంటూ ఆ డోర్ వద్దే వేలాడుతూ ఉన్నది. రుషితను గమనించిన తండ్రి.. వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.