టీఎస్​పీఎస్సీ పేపర్​ లీకేజీ వ్యవహారంలో కొత్త కోణాలు

టీఎస్​పీఎస్సీ పేపర్​ లీకేజీ వ్యవహారంలో కొత్త కోణాలు

టీఎస్​పీఎస్సీ పేపర్​ లీకేజీ వ్యవహారంలో కొత్త కోణాలు వెలుగు చూశాయి. పరీక్షా కేంద్రాల నుంచి కూడా పేపర్​ లీక్​ అయినట్లు నిర్థారణ అయింది. విద్యుత్​ శాఖ డీఈఈ రమేష్​ లీలలు బయటపడుతున్నాయి. పేపర్​ లీక్​ చేయడానికి ఆయన ఇన్విజిలేటర్లతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఏఈఈ, డీఏవో పరీక్షల కోసం హైటెక్​ మాస్​ కాపీయింగ్​ జరిగింది. పరీక్షల్లో మైక్రోఫోన్​తో మాస్​ కాపీయింగ్​పై శిక్షణకు మలక్​పేటలో రమేష్​ కంట్రోల్​ రూమ్​ ఏర్పాటు చేశారు. డీఈఈ రమేష్​ వ్యవహారంపై సిట్​ ఆరా తీస్తోంది.