మైనారిటీ సంక్షేమానికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం - ఉర్దూ ఘర్ చైర్మన్ కరాటే సయ్యద్

మైనారిటీ సంక్షేమానికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం - ఉర్దూ ఘర్ చైర్మన్ కరాటే సయ్యద్

ముద్ర ప్రతినిధి సూర్యాపేట: మైనార్టీ సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు ఉర్దూ ఘర్ /షాదిఖాన చైర్మన్ కరాటే సయ్యద్ అన్నారు. సోమవరం ఆయన తనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ మైనార్టీల స్వయం ఉపాధి కోసం లక్ష ఆర్థిక సహాయం జీవో విడుదల చేయడంతో మైనార్టీ కుటుంబ సభ్యులు కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలిపుతున్నమన్నారు మైనార్టీల సంక్షేమం కోసం ప్రతి సంవత్సరం వేలకోట్ల రూపాయలు బడ్జెట్ ఖర్చు చేయడంతో పాటు మహిళ ఆర్థిక స్వలాభన కొరకు కుట్టు మిషన్ల పంపిణీ చేయడం సంతోషకరమన్నారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు మైనార్టీల కోసం అమలు చేస్తుందని పేదవాళ్లకు షాది ముబారక్, మైనార్టీ గురుకులలో విద్య అందిస్తున్నందుకు ప్రభుత్వానికి రుణపడి ఉంటామని అన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేట ఎమ్మెల్యేగా మూడోసారి గుంట కండ్ల జగదీశ్ రెడ్డి ని సూర్యాపేట నియోజకవర్గం మైనార్టీలు అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని అన్నారు.