సమాచార హక్కు చట్టం డివిజన్ అధ్యక్షులుగా దానయ్య
![సమాచార హక్కు చట్టం డివిజన్ అధ్యక్షులుగా దానయ్య](https://mudranews.in/uploads/images/2023/10/image_750x_651fd2ef10f1b.jpg)
భూదాన్ పోచంపల్లి, ముద్ర: సమాచార హక్కు చట్టం ప్రచార సమితి చౌటుప్పల్ డివిజన్ అధ్యక్షులుగా భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రానికి చెందిన కుక్క దానయ్య నియామకమయ్యారు . శుక్రవారం సమాచార హక్కు చట్టం ప్రచార సమితి రాష్ట్ర అధ్యక్షులు ఎరుపుల శ్రీనివాస్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందజేశారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రగతి, రాష్ట్ర కోశాధికారి యాదగిరి తదితరులు పాల్గొన్నారు.