కెసిఆర్ హయాంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి - బిక్షమయ్య గౌడ్ వెల్లడి

కెసిఆర్ హయాంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి -  బిక్షమయ్య గౌడ్ వెల్లడి

చౌటుప్పల్ (ముద్ర న్యూస్): ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలోనే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందిందని ఆలేరు మాజీ శాసనసభ సభ్యులు మరియు బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బూడిద బిక్షమయ్య గౌడ్ అన్నారు. శనివారం నాడు మునుగోడు శాసనసభ స్థానానికి బారాస అభ్యర్థిగా పోటీ చేస్తున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయాన్ని కోరుతూ ఆయన చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. కాంట్రాక్టర్ పనుల కోసం పార్టీలను మార్చే రాజగోపాల్ రెడ్డికి నియోజకవర్గం ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బడుగు బలహీన వర్గాలకు చెందిన వారి రాజకీయ అభివృద్ధిని అడ్డుకుంటున్న కోమటిరెడ్డి సోదరులకు ఈ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని జోస్యం చెప్పారు. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని అన్ని శాసనసభ స్థానాలలో బిఆర్ఎస్ అభ్యర్థులు గెలుస్తున్నారని ధీమా చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు. బారాస నాయకులు. కార్యకర్తలు. తదితరులు పాల్గొన్నారు.....