మెదక్ మండలంలో డ్రై డే కార్యక్రమాలు

మెదక్ మండలంలో డ్రై డే కార్యక్రమాలు

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ మండలంలో ఎంపిడిఓ ప్రశాంత్ ఆధ్వర్యంలో డ్రై డే-ఫ్రై డే కార్యక్రమాలు నిర్వహించారు. మెదక్ మండలం పరిధిలోని మంబోజిపల్లి, మాచవరం, కాజిపల్లి   గ్రామ పంచాయతీ పరిధిలో అవెన్యూ  ప్లాంటేషన్, హరితహారం  కార్యక్రమాలు చేపట్టారు. అన్ని గ్రామాలలో ఆశ, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. ప్రస్తుత వర్షాకాలం సీజన్లో ప్రతి ఒక్కరూ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని ఎంపీడీవో ప్రశాంత్ సూచించారు.