అదనపు బి.యు లకు ఎఫ్.ఎల్.సి. నిర్వహణ - కలెక్టర్ ఎస్. వెంకట్రావ్
![అదనపు బి.యు లకు ఎఫ్.ఎల్.సి. నిర్వహణ - కలెక్టర్ ఎస్. వెంకట్రావ్](https://mudranews.in/uploads/images/2023/11/image_750x_655c3a2566b8b.jpg)
ముద్ర ప్రతినిధి సూర్యాపేట: జిల్లాకు చేరుకున్న అదనపు బి.యు లను evm గోదాం లో పార్టీల ప్రతిధుల సమక్షంలో ఎఫ్.ఎల్.సి నిర్వహణ చేపట్టామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్. వెంకట్రావ్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ ఆవరణలో ఉన్న evm గోదాం లో చేపట్టిన ఎఫ్.ఎల్.సి అదనపు కలెక్టర్లు సి.హెచ్. ప్రియాంక, ఏ. వెంకట్ రెడ్డి లతో కలసి పరిశీలించారు. ఆయా నియోజక వర్గాలలో పోటీ అభ్యర్థులు ఎక్కువగా ఉన్నందున ఆదనవు బి.యు లను తెప్పించి రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో 12 మంది ఈ. సి. ఐ. ఎల్ ఇంజనీర్ల తో చేపట్టడం జరిగిందని తదుపరి నియోజక వర్గాలకు పంపించడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బి.ఆర్.ఎస్. పార్టీ నుండి సవరాల సత్యనారాయణ, బి.జే.పి. నుండి అబిడ్, కాంగ్రెస్ నుండి కరుణాకర్, బి.యస్.పి. నుండి స్టాలిన్ లు తదితరులు పాల్గొన్నారు.