స్త్రీలను గౌరవించే దేశం మనది

ముద్ర ప్రతినిధి, నిర్మల్:పురాణ కాలం నుంచి మహిళలను గౌరవించే సాంప్రదాయం ఒక్క భారతదేశానికే పరిమితమని, దీన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉందని నిర్మల్ కోర్టు ఏపీపీ అరుణ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా స్థానిక ఆర్కే ఫంక్షన్ హాల్ లో న్యాయవాద పరిషత్ నేతృత్వంలో కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపన్యాసం చేస్తూ ఆమె రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి వంటి మహిళలను ఆదర్శంగా తీసుకొని మహిళలు ముందుకు సాగాలని ఉద్బోధించారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళా న్యాయవాదులు పాల్గొన్నారు.