ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బ తీసేందుకే పేపర్ల లీకేజీ - మంత్రి అల్లోల

ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బ తీసేందుకే పేపర్ల లీకేజీ - మంత్రి అల్లోల

ముద్ర ప్రతినిధి, నిర్మల్: రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బ తీసేందుకు, కేంద్రం కనుసన్నల్లో పేపర్ల లీకేజీ లకు బిజెపి పాల్పడుతోందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి విమర్శించారు. స్థానిక దివ్య గార్డెన్ లో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణా లోని బియారెస్ పార్టీ ప్రతిష్టను చూసి ఓర్వలేక ఇలాంటి దొడ్డిదారి ఎత్తుగడలు అనుసరించటం అలవాటుగా మారిందన్నారు.లీకేజీ లో ప్రధానంగా వ్యవహరించిన ప్రశాంత్ ఆర్ ఎస్ ఎస్ కార్యకర్త అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విలేకరుల సమావేశంలో మునిసిపల్ చైర్మన్ ఈశ్వర్, టౌన్ అధ్యక్షుడు మారుగొండ రాము తదితరులు పాల్గొన్నారు