వెల్గటూర్ లో "కాజవే " మధ్య లో  వరద ప్రవాహంలో నిలిచిపోయిన లారి..  

వెల్గటూర్ లో "కాజవే " మధ్య లో  వరద ప్రవాహంలో నిలిచిపోయిన లారి..  

వెల్గటూర్, ముద్ర : రెండు రోజులు గా కురుస్తున్న భారీ వర్షాలకు పై నుంచి వస్తున్న వరద నీటితో మండలంలో గల వాగులు, వంకలు ఉపొంగు తున్నాయి. ఈ క్రమంలో వెల్గటూర్ నుండి జగదేవ్ పేట  వెళ్లే రహదారి పై వెల్గటూర్ గ్రామశివారులో కాలువ పై నిర్మించిన "కాజ్ వే" పైనుంచి వరద నీరు భారీగా ప్రవహిస్తుండగా అందులో నుంచి సిమెంట్  "లారి" ని డ్రైవర్ తీసుకువెళ్లే ప్రయత్నం చేసి వరద మధ్యలో ఇరుక్కు పోయాడు. కాగా అందులో నుంచి ఎటువెల్లే  అవకాశం లేకపోవడంతో డ్రైవర్ లారిని అక్కడే వదలిపెట్టి బయటకు వచ్చాడు. కాగా ఆ లారిలో సిమెంట్ ను తీసుకువెళ్లి "మెగా"కంపెనీలో ఆన్ లోడ్ చేసి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. పోయేటప్పుడు వరద ప్రవాహం ఉన్నప్పటికి ఏమి కాకపోవడంతో డ్రైవర్ ఈ సాహసం చేసి ఉండవచ్చని బాటసారులు అనుకుంటున్నారు.