అక్రమంగా ఇసుక ఇసుక తరలిస్తున్న లారీ పట్టివేత

అక్రమంగా ఇసుక ఇసుక తరలిస్తున్న లారీ పట్టివేత

 ముద్ర, ఎల్లారెడ్డిపేట :  రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ శివారులో అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న TS02UB2193 నెంబర్ గల లారీని పట్టుకున్నామని ఎస్సై ప్రేమ్ దీప్ గురువారం పేర్కొన్నారు. వాహనాన్ని పోలీస్ స్టేషన్ కు తరలించామని  అన్నారు. లారీ డ్రైవర్ దాడి మల్లేష్ 37 ఓనర్ శ్రీకాంత్ పై కేసు నమోదు చేశామని అదేవిధంగా  అనుమతి లేకుండా ఇసుకను రవాణా చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.