‘మన ఊరు  మన బడి’ పనులను పూర్తి చేయాలి – అడిషనల్‌ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్

‘మన ఊరు  మన బడి’ పనులను పూర్తి చేయాలి – అడిషనల్‌ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్

ముద్ర ప్రతినిధి, జనగామ: ‘మన ఊరు మన బడి’ పనులు కంప్లీట్‌ చేయాలని అడిషనల్‌ కలెక్టర్‌‌ ప్రపుల్‌ దేశాయ్‌ ఆఫీసర్లను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ కార్యాలయ మినీ సమావేశ మందిరంలో ఆయన ‘మన ఊరు మన బడి’పై సంబంధిత విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల మేరకు సూచించిన వివిధ 12 రకాల పనులను చేపట్టడం జరిగిందన్నారు.

జిల్లాలో 176 పాఠశాలలకుగాను ఇప్పటికే 17 బడులు ప్రారంభోత్సవాలు జరిగాయన్నారు. ఈ నెలలో మరో ఏడు స్కూళ్లు ప్రారంభోత్సవాలకు సిద్ధంగా ఉన్నాయన్నారు.  మిగతా స్కూళ్లలో పనులు కూడా వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో డీఈవో కె.రాము, పంచాయతీరాజ్, ఇరిగేషన్, ఆర్ అండ్ బీ, ఈఈలు చంద్రశేఖర్, వినయ్ కుమార్, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.