కొండచరియలు విరిగిపడ్డ ఘటనలో
- 14 మృతదేహాలు వెలికితీత
సీమ్లా :ఈ నెల 14న సిమ్లాలో భారీగా కొండచరియలు విరిగిపడ్డ విషయం తెలిసిందే. సంఘటనా స్థలంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఆర్మీ, స్థానిక పోలీసులు సహాయక చర్యలు చేపడుతున్నారు. శిథిలాల కింద ఇప్పటి వరకు 14 మంది మృతదేహాలను వెలికి తీశారు. ఈ విషయాన్ని సిమ్లా అర్బన్ ఎస్ఎండీ భాను గుస్తా తెలిపారు. ఇంకా శిథిలాల కింద చిక్కుకొని ఉండవచ్చని, ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందన్నారు. సమ్మర్ హిల్లో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు గల్లంతుకాగా.. కుటుంబీకులు ఆందోళనకు గురవుతున్నారు. కొండచరియలు విరిగిపడడంతో శిథిలాల కింద ఎంత మంది చిక్కుకున్నారో తెలియరాలేదని స్థానిక కౌన్సిలర్ పేర్కొన్నారు.