మేళ్లచెరువు ముద్ర 

మేళ్లచెరువు ముద్ర 

రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ పరిపాలన చూసి తమ పార్టీలో చేరుతున్నారని హుజూర్నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి అన్నారు. ఆదివారం మేళ్లచెరువు మండలం లోని కాంగ్రెస్ పార్టీకి చెందిన 100 కుటుంబాలు బిఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. మేళ్లచెరువు మండలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.

మూడు సంవత్సరాల వ్యవధిలో మేళ్లచెరువు మండలంలో 30 సంవత్సరాల అభివృద్ధి కార్యక్రమాలు మౌలిక సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. శివాలయాన్ని ఎంతో అభివృద్ధి చేసినట్లు తెలిపారు. అన్ని వర్గాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే సైదిరెడ్డి తెలిపారు. నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు వివరించారు. ప్రతి కార్యకర్తను ఆదుకుంటామని తెలిపారు. మండలంలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మేళ్లచెరువు సర్పంచ్ శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.