సమస్యల పరిష్కారానికి మంత్రి హామీ

సమస్యల పరిష్కారానికి మంత్రి హామీ

ముద్ర ప్రతినిధి, నిర్మల్: విఏఓ ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ పరంగా కృషి చేస్తామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హామీ ఇచ్చారు. శుక్రవారం ఆయన సోన్ మండల పర్యటన సందర్భంగా మండల విఏఓలు ఆయనను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో వేతనాలు సరిపోవటం లేదని, కనీస వేతనం రూ.26 వేలకు పెంచాలని వారు కోరారు. అలాగే రూ.10 లక్షల ఆరోగ్య బీమా పథకం అమలు చేయాలని కోరారు.