అనారోగ్యంతో వృద్ధుడు  బలవన్మరణం

అనారోగ్యంతో వృద్ధుడు  బలవన్మరణం

ముద్ర, ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన సాన దేవయ్య 75 రాత్రి ఒంటిగంటకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు గత సంవత్సర కాలంగా ఊపిరితిత్తులు, లివర్ సమస్యతో బాధపడుతున్నాడు. కుమారులు ఇద్దరూ  తన తండ్రి ఆరోగ్యం బాగు చేయించాలని లక్షల్లో ఖర్చు చేసి  హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్  ఆసుపత్రిలో వైద్యం అందించారు. కాగా వ్యాధి తీవ్రత పెరుగుతుండడంతో తీవ్ర మనస్థాపానికి గురై జీవితం  మీద విరక్తి చెంది వరండాలోని స్లాపు ఉక్కు  ఉరి వేసుకొని చనిపోయాడు. వేలాడుతున్న మృతున్ని    చూసి భార్య కేకలు వేయడంతో ప్రక్కన నివసిస్తున్న ఇద్దరు కుమారులు వచ్చి బోరున విలపించి కన్నీటి పర్యంతమయ్యారు. పోలీసులకు సమాచారం తెలపడంతో కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతునికి భార్య కుమారులు భాస్కర్, రాజు, కూతురు ఉన్నారు.