సమ్మెలో భాగంగా అంబేద్కర్ కు వినతి పత్రం...

సమ్మెలో భాగంగా అంబేద్కర్ కు వినతి పత్రం...

ముద్ర, మల్యాల: తమ డిమాండ్ల పరిష్కారం కోసం జూనియర్ పంచాయతీ సెక్రటరీలు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది చేపట్టిన సమ్మె 5 వ రోజు కొనసాగింది. మంగళవారం జేపీఎస్, వోపీఎస్ సిబ్బంది సమ్మె ప్రదేశం నుంచి బ్లాక్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి, తమ సమస్యలు వెంటనే పరిష్కారం కావాలని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో జేపీఎస్ సిబ్బంది గుండేటి రవీందర్, ఖరాబుజా తేజస్విని, బరిగే మహేందర్, అజయ్ రాజ్, అజెందర్ రెడ్డి, వోపీఎస్ సిబ్బంది సౌర్య, కవిత, తదితరులు పాల్గొన్నారు.