గో బ్యాక్ అంటూ బిఆర్ఎస్ నాయకులకు నిరసన

గో బ్యాక్ అంటూ బిఆర్ఎస్ నాయకులకు నిరసన

భువనగిరి అక్టోబర్ 29 (ముద్ర న్యూస్) :బిఆర్ఎస్ కు మద్దతు తెలపాలని కోరుతూ పైళ్ల శేఖర్ రెడ్డి కుమార్తె పైళ్ల మన్విత భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని రాయగిరి గ్రామంలో మూడు, నాలుగవ వార్డులలో ఇంటింటి ప్రచారం నిర్వహించగా ఆర్ ఆర్ ఆర్ బాధితులు అంతా ఏకమై నాకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తూనే ఉంటాము అంటూ బి ఆర్ ఎస్ నాయకులకు వ్యతిరేకంగా గో బ్యాక్ అంటూ నినాదాలు చేయగా టిఆర్ఎస్ నాయకులకు రీజనల్ రింగ్ రోడ్డు బాధితులకు ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. అదేవిధంగా ప్రచార కార్యక్రమంలో కొందరు గ్రామస్తులు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు రాలేదని గృహలక్ష్మి రాలేదని బీసీ బందు ఇవ్వలేదని లబ్ధిదారులకు సరైన  పద్ధతిలో అందలే దని ఆమెను ప్రశ్నించారు. మాకు న్యాయం జరిగేంత వరకు ప్రచార కార్యక్రమాన్ని నిలిపివేయాలని రీజనల్ రింగ్ రోడ్ బాధితులు డిమాండ్ చేశారు.