ముద్ర క్యాలెండర్ ను ఆవిష్కరించిన సద్గురువులు

ముద్ర క్యాలెండర్ ను ఆవిష్కరించిన సద్గురువులు

సిద్దిపేట, ముద్ర ప్రతినిధి: ముద్ర పత్రిక అనతి కాలంలోనే ఎవరు ఊహించని విధంగా రాష్ట్రంలో పురోగమిస్తుందని అచల పరంపర సద్గురువులు ఆశీర్వదించారు సిద్దిపేట జిల్లా సిద్దిపేట అర్బన్ మండలం వెలకటూరులో ఉన్న అచల గురువులు, శ్రీ వశిష్ట పరంపర ఆధ్యాత్మిక ట్రస్ట్ సద్గురువులు డాక్టర్ మధుసూదనార్యులు, డాక్టర్ వై సరళ దేవి శుక్రవారం రోజున ముద్ర దినపత్రిక క్యాలెండర్ను గోకులాశ్రమంలో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల మనసులలో పాఠకుల మనసులో ఈ పత్రికా, టీవీ చెరగని 'ముద్ర' వేస్తాయని ఆశీర్వాదం ఇచ్చారు. ప్రజల నాడిని పట్టుకోవడంలో ముద్ర ముందున్నదని చెప్పారు. కాలంలోనే రాష్ట్రంలో ఎవరు ఊహించని విధంగా ఈ పత్రిక,టీవీ పురోగమిస్తాయని వారు వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆశ్రమంలో ఉన్న శిక్షకులకు ముద్ర క్యాలెండర్లను అచల గురువులు అందజేశారు.